శ్రీనగర్: జమ్మూ కశ్మీర్పై అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో జమ్మూ కశ్మీర్ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతలైనా జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం (ఆగస్ట్ 19) సెర్గియో గోర్ శ్రీనగర్కు చేరుకున్నారు. అనంతరం జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారతదేశంలో జమ్ము కశ్మీర్ ఒక ముఖ్యమైన భాగం. ఇప్పుడు ఈ ప్రాంతం మరింత సురక్షితంగా మారింది. జమ్మూ కాశ్మీర్కు జారీ చేసిన అత్యున్నత స్థాయి ప్రయాణ హెచ్చరికను తగ్గించే విషయాన్ని అమెరికా పునఃపరిశీలిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ను అందమైన ప్రాంతమని అభివర్ణించిన గోర్.. భవిష్యత్లో చాలా మంది అమెరికన్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి దాని అందాన్ని ఆస్వాదిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు.
కాగా, ఆర్టికల్ 370 రద్దు, పహల్గామ్ దాడి తర్వాత ఒక అమెరికా రాయబారి జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటించడం ఇదే తొలిసారి. సెర్గియో గోర్ ప్రకటన భారత్కు బిగ్ బూస్ట్ ఇవ్వగా.. దాయాది పాకిస్తాన్కు మాత్రం గట్టి షాక్ తగిలింది. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ పదేపదే చేస్తున్న దుశ్చర్యల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ భారత్లో ముఖ్యమని భాగమని భాగమని గోర్ ఇచ్చిన స్టేట్మెంట్ భారత వైఖరికి గట్టి మద్దతుగా పరిగణించబడుతుంది.
